- District News
- ఉప్పల్లో 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్తో ఎమ్మెల్యే భేటీ
ఉప్పల్లో 22-ఏ భూముల సమస్యపై కలెక్టర్తో ఎమ్మెల్యే భేటీ
Published On
By Ram Reddy
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 22-ఏ కింద నమోదైన భూముల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసి చర్చించారు. 22-ఏ కారణంగా భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 11:01:13
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
