సీపీఐ  ప్రచార యాత్ర ను విజయవంతం చేయండి: పల్లె శేఖర్ రెడ్డి

Published On
సీపీఐ  ప్రచార యాత్ర ను విజయవంతం చేయండి: పల్లె శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఆగస్టు 7, (లోకల్ గైడ్):

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన విధానాలకు నిరసనగా ఈనెల 6 నుండి 14 వరకు నిర్వహిస్తున్న సిపిఐ ప్రచార జాతను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆయన అన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అనేక అంశాలపై మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన సీపీఐ ప్రచార జాత  ఈ నెల 6 నుండి 14 వరకు కొనసాగుతుందనీ అన్నారు. *ఈనెల 9వ తేదీన  ఆదివారం ప్రచార జాత చౌటుప్పల్ పట్టణానికి వస్తున్న సందర్భంగా* పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, బద్దుల సుధాకర్, బోయిన యాదయ్య, టంగుటూరి రాములు, రోషనగారి అంజయ్య, కుంటి పాపయ్య, సింగపంగ బుచ్చయ్య, నీల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
న్యూస్ స్టార్     లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 10: మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిచేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41...
అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు
గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.
మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ 
తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం