- District News
- Ranga Reddy
- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి-బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎ...
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి-బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని, కరోనా వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న సీఎం హామీ ఏమైంది....? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసే కుట్రకు ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కోసం ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ప్రశ్నిస్తుండటంతో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పథకాన్నే ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
హైదర్గూడా డివిజన్ అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులను పక్కనపెట్టి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షులు గుమ్మడి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య తిరుపతి రెడ్డి రాము యాదవ్ అక్యాo రఘు రాజేష్ యాదవ్ కార్మిక విభాగం అధ్యక్షులు ఉప్పల్ శ్రీనివాస్ జహీర్ ఖాన్ సరికొండ దుర్గేష్ అశోక్ కుమార్ చిరంజీవి రవీందర్ యాదవ్ అరుణ రెడ్డి సరితా మహేష్ సుగుణమ్మ ప్రసన్న మంజుల పద్మ పుష్ప భాగ్యమ్మ పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు హిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు
