వనపర్తిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు  చేయాలి. 

తెలంగాణ  జన సమితి పార్టీ  జిల్లా అధ్యక్షులు  యం ఏ ఖాదర్ పాషా.

Published On
వనపర్తిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు  చేయాలి. 

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 5:

 వనపర్తి జిల్లా కేంద్రంలో  ప్రజా యుద్ధ నౌక గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు యం ఏ ఖాదర్ పాషా బుదవారం ఒక లిఖిత పూర్వక ప్రకటన లో  తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో స్వర్గీయ గద్దర్  విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతి ఇవ్వనున్నట్లు ఆయన  తెలిపారు.  తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట, పాటలతో కోట్లాది మంది ప్రజలను చైతన్యపరిచి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్  ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన గుర్తుచేశారు. తన జీవితాంతం పీడిత, తాడిత ప్రజల గొంతుకగా నిలిచి ప్రజా కళలకు అత్యున్నత గౌరవాన్ని తెచ్చిన మహనీయుడు గద్దర్ అని ఆయన కొనియాడారు.
 ప్రజాకళాకారుడి జ్ఞాపకాలను , ఆయన పోరాట స్పూర్తిని భవిష్యత్ తరాలకు గుర్తుచేసేలా  వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ కూడలిలో గద్దర్  కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన తెలిపారు.  ఈ విషయంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి, మునిసిపల్ , జిల్లా అధికారులతో మాట్లాడి రాజీవ్ చౌక్‌లో విగ్రహ ఏర్పాటుకు కావలసిన అనుమతులు, స్థలం  అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన  తెలిపారు .

Tags:

About The Author

Latest News