మైసిగండి మైసమ్మ దేవస్థాన హుండీ లెక్కింపు.

148 రోజుల్లో రూ.29.43 లక్షల ఆదాయం

Published On
మైసిగండి మైసమ్మ దేవస్థాన హుండీ లెక్కింపు.

లోకల్ గైడ్ 
ఆమనగల్లు, ఆగస్టు 25:
రంగారెడ్డి జిల్లా 
కడ్తాల్ మండలం
 పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైసిగండి మైసమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది, భక్తులు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు.
గత 148 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.29,43,801 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన నగదు, ఇతర కానుకలను నిబంధనల ప్రకారం లెక్కించి, భద్రతా చర్యల మధ్య సంబంధిత బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రాజేశ్వర్, ఫీల్డ్ టెస్టింగ్ ఆఫీసర్ శిరీష, ఈవో మర్రి వీరేశం, సర్పంచ్ ఫైమా జవహర్‌లాల్ నాయక్, ఆర్.పీ. భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే దేవస్థాన సిబ్బంది కృష్ణ చంద్రమయ్య, దేవాదాయశాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది, పోలీసుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. హుండీ లెక్కింపు ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో దేవస్థానానికి హుండీ ఆదాయం గణనీయంగా లభిస్తోందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:

About The Author

Latest News