పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలి 

 జి ఓ 97ను తక్షణమే రద్దు చేయాలి 

బీఆర్ఎస్వీ తాలూకా అధ్యక్షులు శీలం శ్రీకాంత్   మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సూచన మేరకు షాద్‌నగర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత 
Published On
పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలి 

 

 

 

WhatsApp Image 2026-08-21 at 17.43.15

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ ఒ .97 ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలను నిరసిస్తూ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సూచన మేరకు షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు శీలం శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూ, డిప్లొమా అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు ఈసెట్ బీటెక్ లో లేటరల్ ఎంట్రీకి అవకాశం కల్పిస్తోందన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల డిప్లొమా గుర్తింపు, ఈసెట్ ఎంట్రీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, పరీక్షా విధానం, సీట్లు, అధ్యాపకులు, మౌలిక వసతుల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి కీలక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సాంకేతిక విద్యా నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు జీ ఓ 97ను తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలోనే యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని శేఖర్, ఉప సర్పంచ్ ధీమ గణేష్, బీఆర్ఎస్వి నాయకులు తుప్పుడు నరసింహా, వడ్డె మహేష్, సంజు నాయక్, ప్రవీణ్, సత్యం, సతీష్, సాయితేజ, తేజ, శివ నాయక్, నవీన్, ఉదయ్, నగేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం