- District News
- Ranga Reddy
- షాప్ నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
షాప్ నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి
ఘన నివాళులు అర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా గురువారం షాద్నగర్ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి " ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులు అర్పించారు సద్భావన దివస్" వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సద్భావన ప్రతిజ్ఞ చేయించారు.
గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్రెడ్ పళ్ళు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ "రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాత. కంప్యూటర్, టెలికాం విప్లవం, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఈరోజు దేశం గర్వంగా చెప్పుకుంటోంది. యువతను ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఆయన" అని కొనియాడారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగునూరి బసవేశ్వరప్ప కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ అలీఖాన్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇబ్రహీం కాంగ్రెస్ శ్రేణులు డంగు శ్రీనివాస్ యాదవ్ చెంది తిరుపతిరెడ్డి ముబారక్ అలీ ఖాన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖదీర్ కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి శ్రీశైలం గౌడ్ శంకర్ చందు కత్తి చంద్రశేఖరప్ప గంగ లింగారెడ్డి గూడా ఉప సర్పంచ్ అశోక్ సీతారాం తదితరులు పాల్గొన్నారు
