అంబ సత్రం భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు డిమాండ్

Published On
అంబ సత్రం భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి

 

 

లక్ష్మీదేవిపల్లి : లోకల్ గైడ్ న్యూస్ :
మండల పరిధిలోని అనిశెట్టిపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి సంబంధించిన అంబ సత్రం భూములను తిరిగి దళితులకు అప్పగించాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు డిమాండ్ చేశారు.

గురువారం ఆయన మాట్లాడుతూ అనిశెట్టిపల్లి గ్రామంలోని అంబ సత్రం భూములను స్థానిక దళితులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే కాలక్రమంలో కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు నయానో, భయానో దళితులను బెదిరించి వారి వద్ద నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అనంతరం కొందరు అధికారులతో కుమ్మక్కై రికార్డులను సైతం తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.

అంబ సత్రం భూములకు సంబంధించి క్రయవిక్రయాలు జరిగే అవకాశం లేదనే విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అంబ సత్రం అధికారులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టి సర్వే నిర్వహించాలని కోరారు. అర్హులైన దళితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేసి వారికి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.

అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులతో పాటు భూములను స్వాధీనం చేసుకున్న వ్యక్తులపై రాష్ట్ర, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని వాసుమల్ల సుందర్రావు హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,