- District News
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి రాములు అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్,మంచిర్యాల మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామోలీస్ ను పరిశీలించి,సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను చేపట్టాలని,నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.తహసిల్దార్ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న ధ్రువపత్రాల సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి,క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిర్ణీత సమయంలోగా జారీ చేయాలని తెలిపారు.సాదా బైనామా,భూభారతి,రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులను అనుసరించి పరిష్కరించాలని తెలిపారు.పెండింగ్ వ్యవహారాలను త్వరితగతిన పరిష్కరించి,నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని,ఎస్ఐఆర్ ప్రక్రియ,రెవెన్యూ సంబంధిత పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసిల్దార్లు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
