మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం వరంగల్ జిల్లాకు రానున్నారు.

నర్సంపేట నియోజకవర్గంలోని దివంగత పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Published On
మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం వరంగల్ జిల్లాకు రానున్నారు.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు08
(లోకల్ గైడ్ న్యూస్)*:

స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లి ఆయనఆకుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
పెద్ది సుదర్శన్‌ కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం..!! పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా నిలవాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయించారు. సుదర్శన్‌ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు, మొత్తంగా రూ.2.25 కోట్లు ఇవ్వాలని, ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని కేసీఆర్‌ భరోసానిచ్చారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...