- District News
- Nizamabad
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...
తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 22:
రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్ చేశారు. యూరియా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధానం రైతులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడకంలో లేని రైతులు, పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు, డిజిటల్ పరిజ్ఞానం కాని రైతులు ఈ యాప్ ద్వారా ఎరువులు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఎరువులు సకాలంలో అందడం లేదని, వెంటనే యాప్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. పాత మాన్యువల్ విధానం ద్వారా ఎరువుల దుకాణాల వద్దే నేరుగా పాత పద్ధతిలో యూరియా కాంప్లెక్స్ ఎరువులు అందజేయాలని, పట్టాదారు పాస్ బుక్ నిబంధనలను సడలింపు చేసి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అందజేయాలని అయన కోరారు.
