డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో 5 రోజుల జైలు.. రూ.10 వేల జరిమానా

Published On
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో 5 రోజుల జైలు.. రూ.10 వేల జరిమానా

సిద్దిపేట ఆగస్ట్ 11(లోకల్ గైడ్):

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.సిద్దిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా, కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన కడమంచి శ్రీనివాస్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News