కుల విచ్చిన్న శక్తులను ఎదుర్కోవాలి...

ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలి....

జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల వెంకన్న
Published On
కుల విచ్చిన్న శక్తులను ఎదుర్కోవాలి...

 లోకల్ గైడ్
మరిపెడ,ఆగస్టు11


కుల విచ్చిన్న శక్తులను ఎదుర్కొని ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల వెంకన్న అన్నారు.మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని కనదుర్గ కళ్యాణ మండపంలో డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల పద్మశాలి సంఘం ముఖ్య నేతల సమావేశం మరిపెడ సంఘం అధ్యక్షుడు దిగజర్ల శ్రీనివాస్(పేపర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వేముల వెంకన్న హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ..పద్మశాలీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలను నెరవేర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు,చలిమల్ల నారాయణ,ఊరుకొండ శ్రీనివాస్,బత్తుల రమేష్,కొండబత్తిని జగదీశ్వర్,కొండబత్తుల వెంకన్న,దాసరి నరేందర్,వెన్నం జనార్ధన్,మేనామ్ వెంకన్న,మాసబత్తిని సతీష్,దిగిజెర్ల ముఖేష్,మేకల యాకయ్య,బాల్యం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News