మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా 

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులునల్ల మనోహర్ రెడ్డి 

Published On
మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా 

 

 


పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 20 (లోకల్ గైడ్)
మూడు రోజుల క్రితం గంగా స్నానానికి వెళ్లి తిరిగి వస్తుండగా బసంత్‌నగర్ రహదారిపై లారీ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికురాయి గ్రామానికి చెందిన పినకాశి సతీష్, స్వప్న, విక్కి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి వైద్య చికిత్సకు భారీగా ఖర్చు అవుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి  మానవతా దృక్పథంతో ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, ఇకముందు కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,