- District News
- కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని ప్రజావాణిలో వినతి
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని ప్రజావాణిలో వినతి
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
కాంగ్రెస్1000రోజుల దగా పాలన,6గ్యారెంటీలు,420 హామీల మోసాలపై బిఆర్ఎస్ పోరుబాటలో భాగంగా బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశాలు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు బెల్లంపల్లి మండల ప్రజావాణిలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6గ్యారెంటీలు,420హామీలను వెంటనే అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటాలు దశలవారీగా కొనసాగుతాయని పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 21:20:58
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
