- District News
- మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన డి ఎం రేవంత్ రెడ్డి
మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన డి ఎం రేవంత్ రెడ్డి
పనులు వేగవంతం చేయాలని అధికారుల కు ఆదేశం
నారాయణపేట జిల్లా
గురుకుల బాలికల పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనుల పరి శీలన అనంతరం ముఖ్య మంత్రి ఏ. రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో చింతల్ దిన్నే వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశా ల నిర్మాణ పనులను పరిశీ లించారు.నిర్మాణ పనుల ను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవం తంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ ప్రతి పడవద్దని సూచించా రు. పనులు నిర్దేశిత ప్రమా ణాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్య లు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయితే గురుకుల పాఠశాల నిర్మా ణానికి స్థలం ఇచ్చిన దాత లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. ముఖ్యమంత్రి మద్దూ రుకు చేరుకున్న సందర్భం గా పట్టణంలో అభిమాను లు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగ తం పలికారు.ఈ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనో హర్ రెడ్డి, కడ ప్రత్యేక అధి కారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్ సరస్వతీ, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుప తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నర్సిములు, వీరేశ్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతిని ధులు, సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.మద్దూరులో అభివృద్ది పనులు పరిశీలించిన సి ఎం.రేవంత్ రెడ్డి,6.అభిమానులతో కరచాలనం చేస్తున్న సి ఎం
-------------------------------------
