- District News
- బిజెపి రాష్ట్ర నాయకులు
బిజెపి రాష్ట్ర నాయకులు
గొట్టుముక్కల సురేష్ రెడ్డి జన్మదిన ఘనంగా

బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.“రక్తదానం – ప్రాణదానం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజాం మహంతకృష్ణ, బీజేవైఎం నాయకులు రామగిరి అఖిల్, రెండ్ల వేణు, పట్టణ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, బొడ్డుపల్లి అంజి, బొడ్డుపల్లి సంపత్, రావిచిట్టి కుమార్, రాచకొండ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
