- District News
- ఈవీఎం గోదామును తనిఖీ చేసిన
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ చర్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాం భద్రతకు సంబంధించి అమలు చేస్తున్న ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల భద్రత, గోదాం నిర్వహణ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
