- District News
- Nalgonda
- జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
నల్గొండ జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈ నెల 18 ,19 తేదీలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి తెలిపారు . దీక్షల నేపథ్యం లో నల్గొండ కలెక్టరేట్ వద్ద స్థల పరిశీలన చేశారు .నల్గొండ నగర జర్నలిస్టులకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు.నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ఈ దీక్షా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం యూనియన్ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీక్షా స్థలాన్ని సందర్శించిన అనంతరం, కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లు , స్థల సౌకర్యాలపై ఆయన యూనియన్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టే ఈ దీక్షలను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోపాటు జర్నలిస్టు నాయకులు అబ్బోజు మదనా చారి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.
