షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష

పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

Published On
షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో షాద్‌నగర్ డివిజన్‌కు సంబంధించిన వివిధ రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెండింగ్ రెవెన్యూ అంశాలు, సర్వే సంబంధిత పనుల పురోగతి తదితర అంశాలను సమీక్షించారు. పెండింగ్ పనులను ప్రాధాన్యతతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సత్వరంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో షాద్‌నగర్ ఆర్డీఓతో పాటు సంబంధిత డివిజనల్ తహసీల్దార్లు, ఏడిఎస్ఎల్ఆర్, డీసీఎస్ఓ , డిఎంసిఎస్ , మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News