కొడంగల్ ఎత్తిపోతల అవకతవకలపై... లోకాయుక్తకు బిఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Published On
కొడంగల్ ఎత్తిపోతల అవకతవకలపై... లోకాయుక్తకు బిఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

నారాయణపేట ఆగస్టు 13:

వికారాబాద్ జిల్లాల పరిధిలో చేపడుతున్న మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవక తవకలు, అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని నారాయణపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేం దర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లు గురువారం లోకా యుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్య క్షులు ఎస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏం.ఎన్.కే. ఎల్.ఐ.ఎస్ లో ముఖ్యంగా నారాయణపేట మండలం పేరపల్ల గ్రామ శివారులో చేపట్టిన భూముల సేకర ణలో పెద్ద ఎత్తున అక్రమా లు చోటు చేసుకున్నట్లు తెల్సుందని, ముఖ్యంగా దొంగ పాస్ బుక్ లతో నష్ట పరిహారం ఎత్తుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పన్నా గంతో దండు కునేందుకు ప్రణాళికలు రూపొందించి నట్లు పక్కా సమాచారం ఉందన్నారు. అంతే కాకుం డా పేరపల్ల శివారులోని జయమ్మ చెరువులో నీరు నిల్వ చేయడం వల్ల కొంత మంది రైతులకు సంబంధిం చి భూములు కొల్పోకున్న, భూములు కోల్పోతున్నట్లు పేర్కొనడం, సర్వే నంబర్లూ ఒక చోట ఉంటే భూములు ఒక చోట ఉన్నట్లు అధికా రులు చెప్పడం రైతులను అయోమయానికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత ఉండేలా చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విచార ణలో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తేలితే సంబంధిత అధికా రులపై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రతి రూపాయి ప్రజాధనం సక్ర మంగా వినియోగించా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లోకాయుక్త విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని వారు కోరారు.
ఫోటో రైట్ అప్:6.విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే లు
______________________

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి