_దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి

_1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా–3ను రద్దు చేయాలి

_రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి _ఎన్‌సీసీడీసీ–తెలంగాణ రౌండ్‌టేబుల్ సమావేశంలో డిమాండ్
Published On
_దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి

 

 

 


కుత్బుల్లాపూర్ ఆగస్టు 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)

సోమాజిగూడ ప్రెస్ క్లబ్  రౌండ్ టేబుల్ సమావేశంలో  దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను విస్తరించాలని తెలంగాణ దళిత క్రైస్తవుల జాతీయ సమన్వయ కమిటీ ( ఎన్  సీ సి డి టి జి) డిమాండ్ చేసింది. మతం ఆధారంగా ఎస్సీ హోదాలో కొనసాగుతున్న వ్యత్యాసాలను తొలగించి, సామాజికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు సమాన రాజ్యాంగ హక్కులు కల్పించాలని కోరింది.
ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్‌సీసీడీసీ–తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు 1950 ఆగస్టు 10నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులోని పేరా–3ను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.మతంతో సంబంధం లేకుండా ఎస్సీ హక్కులు కల్పించాలిసమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు కారణంగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హక్కులు అందడం లేదని పేర్కొన్నారు. ప్రారంభంలో ఎస్సీ హోదాను హిందూ మతానికి చెందిన దళితులకు మాత్రమే పరిమితం చేశారని, అనంతరం సిక్కులు, బౌద్ధులకు కూడా ఈ హోదాను విస్తరించారని తెలిపారు.
అయితే క్రైస్తవులు, ముస్లింలలోని దళితులకు మాత్రం ఈ హక్కులు వర్తించకపోవడం వల్ల మత ప్రాతిపదికన వివక్ష కొనసాగుతోందని నిర్వాహకులు ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని లౌకిక, సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఎస్సీ హోదాను మతంతో సంబంధం లేకుండా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయించాలని వారు కోరారు.సుప్రీంకోర్టులో పిటిషన్
1950 నాటి ఉత్తర్వులోని పేరా–3 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, దానిని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సివిల్ రిట్ పిటిషన్ దాఖలైన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ మత, భాషా మైనారిటీల కమిషన్ (. ఎన్ సి ఆర్ ఎల్ ఎం) మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో అధ్యయనం చేసినట్లు తెలిపారు.నిర్వాహకుల వివరాల ప్రకారం.. కమిషన్ 2007 మేలో తన నివేదికను అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. అనంతరం నివేదికనుపార్లమెంటులోప్రవేశపెట్టినప్పటికీ, దానిపై ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు.పేరా–3 తొలగింపునకు సిఫార్సు
రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలో 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులోని పేరా–3ను పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేసినట్లు ఎన్‌సీసీడీసీ–తెలంగాణ ప్రతినిధులు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల హోదాను మతంతో ముడిపెట్టకుండా, షెడ్యూల్డ్ తెగల మాదిరిగా మత రహితంగా రూపొందించాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు తదితర మతాలకు చెందిన సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఈ పరిధిలోకి వచ్చేలా చట్టపరమైన మార్పులు చేయాలని కమిషన్ సూచించినట్లు తెలిపారు.జాతీయ కమిషన్ల సిఫార్సులను అమలు చేయాలిజాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ( ఎన్ సి ఎస్ సి), జాతీయ మైనారిటీల కమిషన్  కూడా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై సానుకూలంగా స్పందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.2010 ఏప్రిల్ 22న ఎస్సీ హోదా విస్తరణకు సంబంధించి పేరా–3ను తొలగించాలన్న సిఫార్సును జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గుర్తించి ఆమోదించిందని తెలిపారు. జాతీయ మైనారిటీల కమిషన్ కూడా ఈ అంశంపై అధ్యయనం చేసి సానుకూల సిఫార్సులు చేసినట్లు వెల్లడించారు.అట్రాసిటీస్ చట్టం పరిధిలో రక్షణ కల్పించాలి2002లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ పనితీరు సమీక్షా జాతీయ కమిషన్ ( ఎన్ సి ఆర్ డబ్ల్యు సి ) కూడా షెడ్యూల్డ్ కులాల నుంచి క్రైస్తవ మతంలోకి మారినవారు తమ హిందూ సహచరుల మాదిరిగానే కుల ఆధారిత నేరాలు, అఘాయిత్యాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వారికి కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం, 1989 కింద రక్షణ కల్పించాలని సూచించినట్లు సమావేశంలో ప్రస్తావించారు.అలాగే 2011లో బెంగళూరులో జరిగిన బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా అంశంపై తీర్మానం చేసిన విషయాన్ని కూడా నాయకులు గుర్తుచేశారు.ప్రధాని మోదీపై ఆశాభావంప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకుని దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు న్యాయం చేయాలని ఎన్‌సీసీడీసీ–తెలంగాణ ప్రతినిధులు కోరారు.“రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేసి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా–3ను తొలగించాలి. మతంతో సంబంధం లేకుండా అర్హులైన దళితులకు సమానమైన రాజ్యాంగ హక్కులు కల్పించాలి” అని వారు డిమాండ్ చేశారు.దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు సామాజిక న్యాయం, సమాన హక్కులు కల్పించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
సమావేశంలో  ఎం సి సి డి సి–తెలంగాణకు చెందిన ప్రతినిధులు, రెవ. అబ్రహం, విజయ్ మొరోకోర్, శ్రీమతి పోర్తుటాస్, ఎన్‌డీసీడబ్ల్యూ తదితర అనుబంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల ఎస్సీ హోదా కోసం సమన్వయంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. విజయ్ మోత్కూరి ఎన్సీడీసీ, మంజు సీఎం_ఎన్ డి సి డబ్ల్యూ,
రాబర్ట్ సూర్య ప్రకాష్, టి సి సి, ప్రొఫెసర్ ప్రభుదాస్ టి_ ఎస్ సి కమిషన్ హైదరాబాద్ అర్చ్డిఒసెసే,రాజేందర్, తదితరులు పాల్గొని ప్రసంగించారు

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...