- District News
- Ranga Reddy
- విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బొలెరో ఆటో బోల్తా.. కార్మికుడు మృతి
మరో ఇద్దరికి గాయాలు.. హైదరాబాద్కు తరలింపు
Published On
By Ram Reddy
ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కడ్తాల్ నుంచి ఆమనగల్లు వైపు ఎనిమిది మంది కార్మికులతో బొలెరో ఆటో (టీఎస్31 టీ 1044) బయలుదేరింది.
విఠాయిపల్లి వద్ద జాతీయ రహదారి 765పై ఉన్న యూటర్న్ వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ కోడెల ప్రశాంత్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేయడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గగన్సింగ్, విజయ్, దేవ్సింగ్లకు గాయాలయ్యాయి.
గాయపడిన వారిని తొలుత కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న సమయంలో దేవ్సింగ్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. గగన్సింగ్, విజయ్లను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఆమనగల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 12:28:16
---------------------------------------పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
