- District News
- Ranga Reddy
- టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము ప్రత్యక్షం.
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము ప్రత్యక్షం.
కొద్ది పాటిలో విద్యార్థులకు తప్పిన ప్రాణ గండం..
పాఠశాల పరిసరాలలో అపరిశుభ్రమైన పల్లె ప్రకృతీ వనమే కారణం..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 17 కొందుర్గ్..
సర్కారు బడులలో ప్రతి రోజు ఏదోఒక ప్రమాద కరమైన. సంఘటనలు దర్శన మిస్తున్నాయి
నేడు ఉదయం 8 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని టేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రతి రోజు మాదిరి గానే పేద పిల్లలు పాఠశాలకు వెళ్లారు 4 వ తరగతి గది తెరిచి చేసే సరికి భయంకరమైన విషపూర్తిత నాగుపాము తరగతి గదిలో ఓ మూలన ముడుచుకొని నిద్రిస్తున్న సంఘన ను విద్యార్థులు చూసారు వెంటనే వారు అక్కడ ఉన్న పాఠశాల పారిశుధ్య కార్మికుడికి భయపడుతూ సమాచారం అందించారు.. తరగతి గదిలో గల నునుపైన బండలు ఉండటం వల్ల నాగు పాము ఎక్కడికి వెళ్ళ లేక పోవటంతో దానిని ఆకడికి అక్కడే చంపేశారు..
పాఠశాలకు అనుకోని ఒక. అర. ఎకరం స్థలంలో పల్లే ప్రకృతి వనం లో దట్టమైన గుబురుగ అలుముకున్న చెట్ల వలన అక్కడ అపరిశుభ్ర పిచ్చి మొక్కల వల్ల పాఠశాలలోని విష పూరిత క్రిమి కీటకాలైన.తేళ్ళు పాములు చుంచు ఎలుకలు పాఠశాలోకి నేరుగా ప్రవేశిస్తున్నాయి .మరి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణ లేక పోవటం వల్ల విద్యార్థుల చదువులు ఇల ప్రమాదకరమైన వాతావరణంలో కొనసాగుతున్నాయని విద్యార్థులకు కొద్ది పాటిలో పెను ప్రాణ ప్రమాదం తప్పిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,వారి పిల్లలకు చక్కటి రక్షణ వాతావరణంలో చదువులు సాగేలా ప్రజా ప్రతి నిధులు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ..గ్రామస్థులు విద్యార్థుల. తల్లి దండ్రులు ప్రభుత్వాన్ని కోరారు..
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 12:28:16
---------------------------------------పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
