మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటి నూతన కమిటీ ఎన్నిక

Published On
మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటి నూతన కమిటీ ఎన్నిక

మాగనూరు ఆగస్టు 23:
మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గూడెం శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు పాలెం వెంకటయ్య,జిల్లా ఆర్గనై జింగ్ సెక్రటరీ బండారు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలోఅదివారం  మాగనూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకన్నారు.ఈ సంద ర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, మాగనూరు మండల పరిధిలోని పేద, వెనుకబడిన వర్గాల విద్యా ర్థులకు నాణ్యమైన విద్య నందించడం, విద్యా సంబం ధిత సమస్యల పరిష్కారం మరియు సామాజిక సంక్షే మానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని కోరారు.మాగనూరు మండల అధ్యక్షుడు కావలి ఆనంద్ బైరంపల్లి,
ఉపధ్యక్షుడుబాల్ దాస్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పరశురాం
ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. భీమేష్సహాయ కార్యదర్శి ఆనంద్,కోశాధికారి బ్యాగరి వెంకటేష్ ,కార్యవర్గ సభ్యులుమధు రాము తిమ్మప్పనూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షులు గూడెం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పాలెం వెంకటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు చంద్రశేఖర్ తో పాటు జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ ఆశయాలను మండలంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్తూ, విద్యార్థుల మరియు ప్రజల సమస్యల సాధన కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా ప్రతినిధులు, మండల నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.నూతనంగా ఎన్నికైన కమిటీ
____________________

Tags:

About The Author

Latest News