ఉత్తమ ఉపాధ్యాయురాలు జ్యోతిని  సన్మానించిన  ఎమ్మెల్యే 

Published On
ఉత్తమ ఉపాధ్యాయురాలు జ్యోతిని  సన్మానించిన  ఎమ్మెల్యే 



వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 6:

సమాజ పురోగతిలోనూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కొనియాడారు. శనివారం రాత్రి  వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మదనపురం మండలం దుప్పల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఎం. జ్యోతిని ఆయన ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా రంగానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అపారమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News