సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రామ్ మందిర్ వినాయక మండపం, వివేకానంద యూత్ అసోసియేషన్, చైతన్య యువజన సంఘం, ఐబీ యూత్ కాంగ్రెస్ గణేష్ మండపం, భరత్ సాయి రెడ్డి యూత్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు

వేడుకల్లో పాల్గొన్న జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డి దంపతులు, కాబోయే వధూ వరులు భరత్ సాయి రెడ్డి-పాలక్ పటేల్, నిర్మలా జగ్గారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు
Published On
సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

 

 

 

 లోకల్ గైడ్ /సంగారెడ్డి :

వినాయక చవితి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.వేడుకల్లో భాగంగా తొలుత రామ్ నగర్‌లోని రామ్ మందిర్ వద్ద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డి స్వయంగా భజన చేస్తూIMG-20260915-WA0198 భక్తులతో కలిసి వీధుల గుండా ఊరేగింపుగా బ్రాహ్మణవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్ఠించారు.
అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పర్యవేక్షణలో గంజి మైదాన్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, అల్లుడు గుణ చైతన్య రెడ్డి తొలి పూజల్లో పాల్గొన్నారు.IMG-20260915-WA0199IMG-20260915-WA0196
రామ్ మందిర్ యువసేన సభ్యుడు దత్తు ఆధ్వర్యంలో రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లోనూ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.సంగారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అధ్యక్షతన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తూర్పు భరత్ సాయి రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భరత్ సాయి రెడ్డి, ఆయన కాబోయే సతీమణి పాలక్ పటేల్ ఆధ్వర్యంలో తొలి రోజు పూజలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజలకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.