సిద్దిపేట కమిషనరేట్‌లో 15 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

డీజే సౌండ్లపై నిషేధం, అనుమతి లేకుండా సభలు–ర్యాలీలకు వీల్లేదు

Published On
సిద్దిపేట కమిషనరేట్‌లో 15 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట, ఆగస్టు 5(లోకల్ గైడ్):

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆగస్టు 6 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 21 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు.ఈ ఉత్తర్వుల ప్రకారం కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. బంద్‌ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు లేదా కార్యాలయాలను బలవంతంగా మూసివేయించే ప్రయత్నాలు, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 21 వరకు భారీ శబ్దాలతో డీజే సౌండ్ వినియోగంపై కూడా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మైక్ సెట్ వినియోగించాల్సి వస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించడం లేదా డీజే సౌండ్ వినియోగించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), సిటీ పోలీస్ యాక్ట్, పోలీస్ యాక్ట్–1861 నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News