ఖమ్మం ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Published On
ఖమ్మం ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మం, ఆగస్టు- 26: లోకల్ గైడ్:

ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత సులభతరమైన, సమర్థవంతమైన ఆధార్ సేవలను అందించేందుకు స్థానిక మమత హాస్పిటల్ రోడ్,
కవిరాజ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఖమ్మం ఆధార్ సేవా కేంద్రం   రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన ఖమ్మం ఆధార్ సేవా కేంద్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని వయస్సుల వారికి కొత్త ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్ అప్‌డేట్లు, బయోమెట్రిక్ అప్‌డేట్లు తదితర సేవలను మార్గదర్శకాల ప్రకారం అందించనున్నారు.
కొత్త ఆధార్ నమోదు పూర్తిగా ఉచితమని తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ కేంద్రంలో ఆదివారాల్లో కూడా ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనివల్ల ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, ఇతర ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ఆధార్ సేవలను పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

ఖమ్మం ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం జిల్లాలో ఆధార్ సేవల బలోపేతానికి, పౌర కేంద్రిత డిజిటల్ సేవల విస్తరణకు మరో ముఖ్యమైన ముందడుగని మంత్రి అన్నారు. ప్రజలకు అవసరమైన గుర్తింపు సేవలను మరింత అందుబాటులోకి, సమర్థవంతంగా, సౌకర్యవంతంగా అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హైదరాబాద్ డైరెక్టర్ కె.ఎం. భారతి, అసిస్టెంట్ మేనేజర్ పి. రత్నాకర్, బీఎల్‌ఎస్ ఆధార్ సేవా కేంద్రం ప్రతినిధులు రీజినల్ మేనేజర్ కె. శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ దుగ్గి హరినాథ్, ఆపరేషన్స్ మేనేజర్  పి. సురేష్ కుమార్, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
.

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన