వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్

మహా వరుణ యాగంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పూజల్లో పాల్గొన్న వైరా ఎమ్మెల్యే

Published On
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 10 : వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండాలని, పాడి పంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆకాంక్షించారు. నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణ యాగంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, సీఎంతో కలిసి వరుణ యాగం పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలు సంతోషంగా ఉండేందుకు పుష్కలంగా వర్షాలు కురిసి సాగునీటి వనరులు సమృద్ధిగా నిండాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వైరా నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పష్టం చేశారు. రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతానని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్): బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
కార్మిక–రైతు పోరాటానికి డీవైఎఫ్ఐ  మద్దతు
రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు