ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..వెల్లడి.

Published On
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు10
(లోకల్ గైడ్ న్యూస్)*:

హనుమకొండ, వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతమైన  సమాజాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హనుమకొండ లో ప్రముఖ వైద్యులు నరసింగరావు, సుధీర్, రామకృష్ణ, శివకుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇషా హాస్పిటల్ ను ప్రారంభించిన అనంతరం పొంగులేటి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోగులకు అవగాహన కల్పించి తద్వారా ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని అన్నారు. అనంతరం హస్పటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన అధునాతనమైన ల్యాబ్, ఐసీయూ  తదితర విభాగాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డిఎంహెచ్వో డాక్టర్.అప్పయ్య, పెసరు విజయ్ చందర్ రెడ్డి, కాళీ ప్రసాద రావు, వైద్యులు అనిల్, సురేష్, రోహిత్,అరుణ, పద్మావతి నితిన్, మాజీ కార్పొరేటర్ బసవరాజు కుమారస్వామి, సంపత్, బసవరాజు శ్రీమాన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ముక్కిసా లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్): బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి: రాందాస్ నాయక్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
కార్మిక–రైతు పోరాటానికి డీవైఎఫ్ఐ  మద్దతు
రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు