- District News
- Nizamabad
- అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
అదుపు తప్పి బోల్తాపడ్డ ఆటో.. మహిళ మృతి
మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ముప్కాల్ నుంచి మెండోరా వైపు ప్యాసింజర్లతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
Published On
By Ram Reddy
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 10:
అదుపుతప్పిన ఆటో బోల్తా పడగా ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాదు జిల్లా ముప్కాల్ నుంచి మెండోరా వెళ్తుండగా చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ముప్కాల్ నుంచి మెండోరా వైపు ప్యాసింజర్లతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కోడిచర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయ్ అనే మహిళ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆటోను ముప్కాల్ గ్రామానికి చెందిన సాయికుమార్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 20:59:43
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్):
బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
