- District News
- Khammam
- విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ
విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ
సింగరేణి పాఠశాల విద్యార్థులకు షూ, యూనిఫాంల పంపిణీ
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 10, లోకల్ గైడ్ :
సింగరేణి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ) చేతుల మీదుగా షూ, యూనిఫాంలను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్న సర్పంచ్ టోనీని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టోనీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి
తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ సహకారంతో సింగరేణి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సర్పంచ్ టోనీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
