సెన్సస్‌ వివరాలను ఈ నెల 20లోగా అందించాలి:

కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా

Published On
సెన్సస్‌ వివరాలను ఈ నెల 20లోగా అందించాలి:


మహబూబ్ నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

అనంతరం, జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్‌ హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ స్టేజ్‌-1 విజయవంతంగా పూర్తయిందని  తెలిపారు. తదుపరి దశ సెన్సస్‌ ప్రక్రియలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ కోరకు అవసరమైన సమాచారాన్ని శాఖల వారీగా వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో సేకరిస్తున్నట్లు చెప్పారు.31 సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్లు తమ పరిధిలోని వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు పంపించాలని ఆదేశించారు. సెన్సస్‌కు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని సూచించారు. సెన్సస్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోరారు.కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డి.ఆర్.డి.ఓ. నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇంచార్జి అధికారి  బి. నర్సింహులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్