పచ్చదనం కోసం ఎంపీకి ఎమ్మెల్యే వినతి

Published On
పచ్చదనం కోసం ఎంపీకి ఎమ్మెల్యే వినతి

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 9:

 ఉప్పల్‌ నియోజకవర్గంలో నాటిన మొక్కల సంరక్షణకు 30 వేల ట్రీగార్డులు అవసరమని, ఇందుకు రూ.60 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులు సమకూర్చాలని కోరుతూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటుతున్నామని, వాటి సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఉప్పల్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈసీఐఎల్‌ సంస్థకు సీఎస్‌ఆర్‌ కింద ట్రీగార్డులు లేదా ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదన సమర్పించినట్లు పేర్కొన్నారు. మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు తగిన రక్షణ కల్పిస్తే నియోజకవర్గంలో పచ్చదనం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, బీఆర్‌ఎస్‌ నాయకుడు నాగారం బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...