సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

Published On
సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 31
జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలొ భగంగా జిల్లా అధికారులు మంత్రి పర్యటన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) నోటీసుల జారీ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నందున  సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

     కావున ప్రజలు ముందస్తు సమాచారాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కోసం జిల్లా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News