సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలకు ఇబ్బందులే

చర్లలో సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతి

Published On
సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలకు ఇబ్బందులే

 

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. చర్ల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ నుంచి సాయిబాబా ప్రాంతం వరకు డ్రైనేజీ నిర్మించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు.

Tags:

About The Author

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి* వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
గణనాథుడి రాకకు ఆమనగల్లు ముస్తాబు!
ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.కలెక్టర్ స్నేహ శబరిష్