వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-
వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో దోమల బెడద తీవ్రంగా పెరిగింది.గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో నిధులు లేకపోవడంతో దోమల నిర్మూలనకు ఉపయోగించే ఫాగ్గింగ్ మిషన్లను మూలకు పెట్టి ఉంచడంతో అవి రిపేర్లకు నోచుకోక తీవ్ర ఇబ్బంది లో ప్రజలు . గ్రామాల్లో స్ప్రే చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.2026-2027 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీ ట్రెజరీ అకౌంట్లలో నిధులు ఉన్నప్పటికీ, ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయకుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మూలకు పడేసి అలాగే ఉంచడం గనార్హం.పాలకులకు ప్రజల ఇబ్బందులను పట్టించుకొనే దాకాలాలు లేవని ప్రజలు వాపోతున్నారు,అధికారులు మాత్రం పట్టి పట్టనట్టు ప్రజలు ఎలాగుంటే మాకేంటి మేము బాగానే ఉన్నాము అనే ధోరణిలో వ్యవహారిస్తున్న తిరును బట్టి ప్రజలు మండిపడుతున్నారు.వర్షాకాలం మొదలై మూడు నెలలు అవుతున్నా ఫాగ్గింగ్ మిషన్లను రిపేర్ చేయక పోవడం చర్చనియంగా మారింది .దోమలు విపరీతంగా పెరిగి ప్రజలను కుడుతుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా, మృత్యువాత పడుతున్న చలనం లెని ప్రజా ప్రతినిధులు.దోమలతో పిల్లలు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు,మండల అభివృద్ధి అధికారి స్పందించి తొందరగా మిషన్లను రిపేర్ చేయించి పంచాయతీలలో స్ప్రే చేయాలనీ గ్రామలో ఉంటున్న ప్రజలు కోరుతున్నారు..