పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

కలెక్టర్ ప్రియాంక 

Published On
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి


నారాయణపేట సెప్టెంబర్ 10:

బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని జిల్లాగా నారాయణపేట ను తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపా రు.మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ,జిల్లా మహి ళా సాధికారికత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో - బేటీ పడావో పథకం ద్వారా  ఉచిత కంప్యూటర్ శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థు లకు కలెక్టర్ కార్యాలయం లో సమావేశం ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సి.హెచ్ ప్రియాంక హాజరై మాట్లాడుతూ బాలికలు నైపుణ్య శిక్షణలు పొంది, ఆర్థిక సాధికారత సాధించాలి. అలాగే బాలి కలు ఉన్నత విద్య చదివి జీవితంలో ఉన్నత రంగాల్లో రాణించాలని బాలిక సాధి కారత సాదించాలని అన్నా రు. అలాగే నారాయణపేట జిల్లాను బాల్య వివాహాలు లేని జిల్లాగా బాల కార్మికు లు లేని జిల్లాగా మార్చుకో వడానికి మనమందరం తమ వంతు కృషి చేద్దా మని పిలుపు ఇచ్చారు. కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా ఆన్లైన్ బిజినెస్ చేయవచ్చన్నారు. అలాగే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు సంపాదించా లన్నారు.జిల్లా సంక్షేమ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ మహిళాభి వృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాలు వివరించారు. లింగ వివక్షత లేని సమా జం నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.అనంతరం 45 మంది అభ్యర్థులకీ సర్టిఫికెట్స్ అందజేశారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకట్ రాములు  మాట్లాడుతూ స్నేహ గ్రూప్స్ ప్రధాన ఉద్దేశాలు వాటి లక్ష్యాలు వివరించారు బాలికలు సంఘాలు నిర్మించుకొని సంఘటితమై సాధికారత సాధించాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో డిపిఆర్ఓ రషీద్ , జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నరసిం హులు, జెండర్ స్పెషలి స్టులు అనిత,నర్సిములు, శిక్షణ కేంద్రాల మేనేజంగ్ డైరెక్టర్స్ వెంకటేష్,పటేల్ ఆంజనేయులు, శ్రీనివాస్, శిశు సంక్షేమ శాఖ అధికారు లు,అభ్యర్థులు పాల్గొన్నా రు.
ఫోటో రైట్ అప్ 7.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ 
____________________

Tags:

About The Author

Latest News

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
        శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ): మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం. 
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి