మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు

నేడు తాండూర్‌లో ప్రశంసాపత్రాలతో సన్మానం - మండల విద్యాధికారి నర్సింగ్‌రావు

Published On
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు

లోకల్ గైడ్/తాండూర్:
విద్యార్థుల అభ్యున్నతికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు, పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేసిన 17 మంది ఉపాధ్యాయులను పెద్దేముల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి నర్సింగ్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ విధుల్లో ప్రతిభ కనబరుస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాలల పురోగతికి కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం తరఫున నేడు (శుక్రవారం)ఘనంగా సన్మానించనున్నారు.పెద్దేముల్ మండలానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఎస్. మంజుల (ఎస్ఎ-తెలుగు), పి. లింగమూర్తి (ఎస్ఎ-గణితం), సి. జయమ్మ (ఎస్ఎ-తెలుగు), అనిత (సిఆర్టి-హిందీ, కేజీబీవీ పెద్దేముల్), ఎం.కె. వెంకట కృష్ణారెడ్డి (పీజీటీ-జంతుశాస్త్రం, టిజిఎంఎస్ గొట్లపల్లి), కె. అన్నపూర్ణ ( పిఎస్హెచ్ఎం, ఎంపీపీఎస్ పెద్దేముల్), కె. స్నేహలత (ఎస్జిటి, ఎంపీపీఎస్ బండపల్లి), సయ్యద్ మహబూబ్ పటేల్ ఎంపీపీఎస్ తట్టేపల్లి), కావలి రవిందర్ ( ఎంపియుపిఎస్ గోపాల్‌పూర్), ఈ. బారాజ్ ( ఎంపీపీఎస్ హన్మాపూర్), జె. సౌజన్య (కందనెల్లి తాండా), ఎన్. అవంతి (ఎంపీపీఎస్ హన్మాపూర్), సిహెచ్. సుజాత (ఎస్జిటి గిర్మాపూర్), ఏ అనూష (ఎస్జిటి థింసాన్ పల్లి),తదితరులు ఉన్నారు.ఎంపికైన ఉపాధ్యాయులను నేడు(శుక్రవారం) సాయంత్రం 4:30 గంటలకు తాండూర్‌లోని తులసి గార్డెన్‌లో ప్రశంసాపత్రాలతో సన్మానించనున్నారు.కాగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి నర్సింగ్‌రావు తెలిపారు.

Tags:

About The Author

Latest News

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.1.55 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
        శంకర్‌పల్లి, ( లోకల్ గైడ్ ): మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే
నేటి తరానికి వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శం. 
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ప్రతిభ చాటిన వాకర్స్  సభ్యులకు ఘన సన్మానం
బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరవనిత ఐలమ్మ. - ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి.
మండలంలో 17 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక. విద్యార్థుల అభ్యున్నతి, పాఠశాలల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
పేట జిల్లాను బాల కార్మికు లు,బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి