- District News
- Nizamabad
- నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం
నిజామాబాద్ లో గవర్నర్ కు ఘన స్వాగతం
Published On
By Ram Reddy

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కాన్వాయ్ ద్వారా గవర్నర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతతం జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. జాతీయ, రాష్ట్ర గేయాలపన అనంతరం, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతులతో భేటీ అయ్యారు. ఎం.పీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పసుపు బోర్డు చైర్మన్ పి.గంగారెడ్డి, సెక్రటరీ ఎన్.భవానీశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ తదితరులతో కలిసి సునేహరి మిట్టి అభియాన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 19:19:07
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆఫ్ కాలేజియేట్
