- District News
- Nizamabad
- ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక
ఈ నెల 25 న నిజామాబాదు కు తెలంగాణ గవర్నర్ రాక
Published On
By Ram Reddy
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లా లో పర్యటించనున్నారు. నగరంలోని పసుపుబోర్డు కార్యాలయంలో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు
ఉదయం 10.20 గంటలకు ఇందూరుకు వస్తారు . ఆగస్టు 25న ఉదయం 9:15 గంటలకు లోక్ భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ ఐడీవోసీ హెలిప్యాడ్కు 10:20 గంటలకు వస్తారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యాంటీ-డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం, నేషనల్ టర్మరిక్ బోర్డులో రైతులతో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పీహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాయంత్రం 3:20 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 15:23:36
కారేపల్లి (సింగరేణి ), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జిల్లా
