- District News
- Nizamabad
- డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన...
డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన...
నిజామాబాదు జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 17:
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.
బీజేవైఎం నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ వందేమాతర గీతాలాపన చేయలేదని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. వారికి వందేమాతర గీతం ఎలా పాడాలనేది నేర్పించేందుకు తాము కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట వందేమాతరం గీతాలాపన చేశామన్నారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్, కార్పొరేటర్లు కల్పె అర్చన చిరంజీవి, సుధీర్, శశాంక్, శ్రావణ్ పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
