- District News
- Ranga Reddy
- ప్రజా నాయకుడికి పట్టాభిషేకం మేకగూడ సింగిల్ విండో చైర్మన్ గా అంబటి ప్రభాకర్
ప్రజా నాయకుడికి పట్టాభిషేకం మేకగూడ సింగిల్ విండో చైర్మన్ గా అంబటి ప్రభాకర్
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తికి..నేడు పార్టీలో దక్కిన బహుమానం
కొత్తూర్ ఆగస్టు 08
*కష్టకాలంలో వెన్నుచూపని ధైర్యం..*
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, అంబటి ప్రభాకర్ ఎన్నడూ అధైర్యపడలేదు.అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ప్రజల గొంతుకగా నిలిచారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి అత్యంత ముఖ్య అనుచరుడిగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి సేవలందించారు.అంబటి ప్రభాకర్ పడ్డ దశాబ్దాల కష్టానికి,పార్టీ పట్ల ఆయనకున్న అచంచలమైన విధేయతకు దక్కిన ఉన్నతమైన గౌరవమే ఈ పిఎసిఎస్ చైర్మన్ పదవి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రయాణాన్ని ప్రారంభించి, నేడు ఒక బాధ్యతాయుతమైన చైర్మన్ స్థానాన్ని అధిరోహించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ప్రజాసేవకుడు,రైతు బిడ్డ అయిన ప్రభాకర్ ను అధిష్టానం ఈ పదవికి ఎంపిక చేయడం పట్ల గ్రామస్థులు,పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.తన పదవికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డికి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డికి, పార్టీ కార్యకర్తలు అందరికి రుణపడి ఉంటా అని నూతన సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్ తెలియజేశారు.
