హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ . రంగారెడ్డి

హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ . రంగారెడ్డి

జిల్లాలో పలుచోట్ల హెచ్ఐవీ పై అవగాహన భారీ బైక్ ర్యాలీ. 
Published On
హెచ్ ఐ వీ సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు - రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ . రంగారెడ్డి

 

రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 18, ( లోకల్ గైడ్ ):

హెచ్ ఐ వీ సోకినవారి పట్ల వివక్షత చూపరాదని, ప్రేమతో స్నేహ పూర్వకంగా మెలగాలని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ స్వర్ణకుమారీ అన్నారు.  మంగళవారం హెచ్ ఐ వీ, ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య,  ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 
ఈ బైక్ ర్యాలీని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ స్వర్ణ కుమారి జెండా ఊపి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారిణి డాక్టర్ పాప రావు, డి టి ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.  కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెంటర్స్ ఆరోగ్య శాఖ సిబ్బంది, యువత, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
బైక్ ర్యాలీలో హెచ్ ఐ వీ, ఎయిడ్స్ నివారణ, సురక్షిత జీవన విధానం, పరీక్షలు, చికిత్స, వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం వంటి అంశాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. బైక్‌లపై అవగాహన పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణ కుమారి మాట్లాడుతూ హెచ్ ఐ వీ, ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. హెచ్ ఐ వీ తో జీవిస్తున్న వారిని వివక్షకు గురిచేయకుండా వారికి గౌరవం, అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
హెచ్ ఐ వీ, ఎయిడ్స్ కు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం 1097 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ణి వినియోగించుకోవాలని సూచించారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...