- District News
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల
పెద్దపల్లి, జిల్లా ప్రతినిధి
సెప్టెంబర్ 01 (లోకల్ గైడ్)
తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యా
ర్థులకు సంబంధించిన రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ , స్సీ , స్ టీ జేఏసి ధర్మ సమాజ్ పార్టీ (డీస్పీ ) సంయుక్త ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మార్వో కి వినతిపత్రాలు అందజేశారు.
పెండింగ్ బకాయిల కారణంగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో డీస్పీ జిల్లా అధ్యక్షుడు మాతంగి రేవంత్ మహారాజ్, జేఏసీ జిల్లా కో-కోఆర్డినేటర్ గరిగంటి కుమార్ ముదిరాజ్, కుమార్ పటేల్, అంజి గౌడ్, భాస్కర్ యాదవ్, కె. రమేష్, కె. అవినాష్, ఏ. శంకర్, ఏ. గోపి, రామ్ మూర్తి, ఎలమంద సంజీవ్ గౌడ్, తాళ్ల లక్ష్మణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
