గాయపడిన బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం

లబ్ధిదారుడికి చెక్కు అందజేసిన ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల రవీందర్

Published On
గాయపడిన బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం

లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 13: రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామానికి చెందిన సాటూ విష్ణువర్ధన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన చెక్కును ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ లబ్ధిదారుడికి అందజేశారు.

సుమారు ఆరు నెలల క్రితం విష్ణువర్ధన్ కుడి చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్సకు అయిన ఖర్చులో కొంత మేరకు ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.30,500 మంజూరైనట్లు రవీందర్ తెలిపారు.

ఈ సందర్భంగా తాళ్ల రవీందర్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తన మిత్రుడు, సోదరుడు సాటూ విష్ణువర్ధన్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందడం పట్ల తాళ్ల రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి