ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి 

మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ 

Published On
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి 

గండిపేట, సెప్టెంబర్ 5 (లోకల్ గైడ్ ) :

భక్తి శ్రద్దలతో దైవ భావంతో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని నార్సింగి మున్సిపల్ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ఆకాంక్షించారు. శనివారం  నార్సింగి సర్కిల్  అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని జయశంకర్ పార్క్‌లో గౌరాంగ ధామ్ (ఇస్కాన్ సికింద్రాబాద్) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు. అనంతరం  హరినామ సంకీర్తన, లడ్డు కృష్ణ–రాధాకృష్ణ అభిషేకం, శ్రీకృష్ణుని మహిమపై ఆధ్యాత్మిక ప్రసంగం, చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్, నృత్య ప్రదర్శనలు, హారతి, పుష్పసేవ, జూలన్ సేవ, ఉట్టి కొట్టే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులందరికీ మహాప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి  నేక్నాంపూర్ డివిజన్ అధ్యక్షుడు జితేందర్ మెరుగు, మాజీ కార్పొరేటర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, తాజ్ భాయ్  
అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.  జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే. 
        శంకర్ పల్లి, (లోకల్ గైడ్ ):  జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్
_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు