- District News
- Ranga Reddy
- విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది - డి ఈ ఓ వెంకటేశ్వర్లు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది - డి ఈ ఓ వెంకటేశ్వర్లు.
మైలార్దేవ్ పల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన. డి ఇ ఓ వెంకటేశ్వర్లు.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. అదే విధంగా ప్రత్యేక శ్రద్దతో విద్యార్థులు విద్యనభ్యశించి తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేలుసుకోవాలని సూచించారు. మంగళ
వారం రాజేంద్ర నగర్ మండలంలోని మైలార్ దేవ్ పల్లి అలాగే జడ్పీఎచ్ఎస్ మైలార్దేవ్ పల్లి ప్రభుత్వ పాఠశాలను అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైమరీలో 5 వ తరగతి విద్యార్థులను చదివించడంతో పాటు మ్యాథ్స్ చేయించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సభినందిస్తూ, సరిగ్గా చదవని వారిని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. విద్యార్థులు సైతం ఉపాధ్యాయుల సపోర్ట్ తీసుకోని శ్రద్దగా చదువుకోవాలని సూచించారు. అదే విధంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలని ప్రధానోపాధ్యాయున్ని ఆదేశించారు. ఇంకా జిల్లా పరిషత్ స్కూల్ కు కూడా సందర్శించారు. హిందీ క్లాస్, సోషల్ క్లాస్ లను కూడా పరిశీలించారు. ప్రధానంగా విద్యార్థులకు అన్ని రకాలుగా చదవడం, రాయడం రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ శంకర్ రాథోడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్ర శేఖర్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు.
