విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.    

వనపర్తి బండార్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ .
Published On
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి.

వనపర్తి లోకల్ గైడ్  ప్రతినిధి ఆగస్ట్ 12 :

  వనపర్తి పట్టణంలోని బండార్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠశాల యూనిఫార్మ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన అదనపు కలెక్టర్, విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాల హాజరు, క్రమశిక్షణ తదితర అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ, పాఠశాలకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరై ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన వంటశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భోజనం తయారు చేసే సమయంలో పరిశుభ్రత, హైజీన్‌తో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. వంటశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బాధిత  కుటుంబాన్ని  పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు బాధిత  కుటుంబాన్ని  పరామర్శించిన మండల. బిఆర్ ఎస్ నాయకులు
లోకల్ గైడ్ న్యూస్ 12 కొందుర్గ్. కొందుర్గ్ మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇప్పలపల్లి నరసింహులు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైన విషయం...
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
కల్వకుర్తి అభివృద్ధికి భారీ ప్రతిపాదనలు.. సీఎం రేవంత్‌రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలి.
నీటి ప్రతి చుక్కను పొదుపు చేసుకోవాలి
ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదారి
ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన